పింఛన్దారులను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):చేయూత పింఛన్లను పెంచుతానని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పి నేటికీ రెండు సంవత్సరాలు గడిచిన పింఛలను పెంచకపోవడం అనేది బాధాకరం. పింఛన్లను పెంచలేని చేతకాని ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నాము. చేయూత పింఛన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పెంచాలని లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నాం. చేయూత పింఛన్లని విడతల వారీగా కాకుండా ఒకేసారి అందరికీ పింఛన్లను పెంచాలని, కొత్త పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.