మూడు లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన భీమ్ భరత్
హైదరాబాద్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ ని సంప్రదించగా వారు రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC ను మంజూరు చేశారు.సంబంధిత ప్రపోజల్ LOC ని గురు వారం భీమ్ భరత్ గారి నివాసంలో వారికి అందచేశారు. మంచి వైద్యం అంది, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.