prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 3:50 am Digital Edition : PRAJA KSHETRAM

వరి పంటలపై లాయర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం

వరి పంటలపై లాయర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం

వేములపల్లి, పిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):వేములపల్లి మండల పరిధిలోని రావువారి గూడెం గ్రామంలో ఎంవైఆర్ పంక్షన్ హల్ నందు శెట్టిపాలెం, రావువారి గూడెం గ్రామాల రైతులకు శుక్రవారం బాయర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో స్థానిక రైతులకు వ్యవసాయ పంటలపై అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కంపెనీకి సంబందించిన అధికారులు మాట్లాడుతూ రైతులు నాట్లు వేసిన నాలుగైదు రోజుల నుండే పంట పొలాలకు తెగుళ్ళు వస్తాయని వరి ఆకులపై మొలిపురుగు, పంట వేరు భాగంలో తుంగ జాతి, గడ్డి జాతి లాంటివి కలుపు ఏపుగా పెరిగి వరి ఎదుగు దలను నాశనం చేసి పంట దిగుబడిని తగ్గిస్తాయని అన్నారు. రైతులు బాయర్ కాపెనికి సంబందించిన పురుగు మందులు కౌన్సిల్, బికోట (గుళికలు)వయగో, నేటివో, అంట్రోకార్ వంటి మందులు వాడితే పంటలోని కలుపును ఎదగకుండా చేసి పురుగులను నాశనం చేసి పంట దిగుబడిని పెంచుతానికి ఈ మందులు ఉపయోగ పడతాయాని అన్నారు. ఈ కార్యక్రమంలో బాయర్ కంపినికి సంబందించిన సిబ్బంది సీ.ఏ.ఏమ్ నారాయణ రెడ్డి, సీసీఎం శ్రావ్య రెడ్డి, సేల్స్ ఆఫీసర్ హేమంత్, సూపర్ వైజర్ పరంగి రాములు మరియు సిబ్బంది రైతులు పాల్గొన్నారు.