జడ్చర్ల మార్చురీలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల మార్చురీలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు మహబూబ్‌నగర్‌, మార్చి 03(ప్రజాక్షేత్రం):మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మం డలం నాగసాలకు చెందిన భీమేశ్‌ (32) ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. దీంతో మార్చురీలో కుక్కల శబ్దం రావడంతో దగ్గరికి వెళ్లి చూ సిన బంధువులకు ఓ కుక్క మృతదేహాన్ని పీక్కుతినడం కనిపించింది. కుటుంబీకులు ఈ ఘటనను వీడియో...