పాఠశాలలో ప్రమాదకరంగా మారిన చెట్టు
- జెడ్పీ హైస్కూల్లో చెట్టు ముప్పు
శంకర్పల్లి, మార్చి 12(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పెద్ద చెట్టు విరిగే ప్రమాదంలో ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టు భాగం ఇప్పటికే చీలిపోవడంతో ఎప్పుడు పడిపోతుందోనన్న భయం నెలకొంది. చెట్టు కిందగానే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలి లేదా తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు కోరుతున్నారు.