మహబూబ్నగర్ అభివృద్ధికి సరికొత్త బాట
- 2026-27 తొలి బడ్జెట్ ప్రవేశం మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి మార్చి 29(ప్రజాక్షేత్రం):మహబూబ్నగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన తొలి బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ M. సురేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్య అంశాలు:
కార్పొరేషన్గా మారిన తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి అంచనా బడ్జెట్ను మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. ప్రజల నుండి వసూలు చేసే ప్రతి రూపాయిని , అవినీతికి వైపు వెళ్లకుండా నగర అభివృద్ధికి వినియోగించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి మహబూబ్నగర్ను రాష్ట్రంలోనే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మేయర్ తెలిపారు. ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు.
