prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 6:22 am Digital Edition : PRAJA KSHETRAM

రేకుల డబ్బాలను తొలగించే విషయంలో డబ్బా ఓనర్లకు భరోసా ఇచ్చిన రాష్ట్రమంత్రి వాకిటీ శ్రీహరి

రేకుల డబ్బాలను తొలగించే విషయంలో డబ్బా ఓనర్లకు భరోసా ఇచ్చిన రాష్ట్రమంత్రి వాకిటీ శ్రీహరి

మక్తల్ ప్రతినిధి మార్చ్ 30(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందర ఎంపీడీవో ఆఫీస్ ముందర మార్కెట్ యాడ్ ముందర, ఉన్న రేకుల షాపులను తీసివేయాలని గత వారం రోజులుగా ఆత్మకూరు మున్సిపల్ పాలకవర్గం మరియు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క స్థలంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని అందుకు నిర్మించుకున్న రేకుల డబ్బాలను తీసివేయాలని డబ్బా ఓనర్లకు ఆదేశించారు. కనుక ఈ సందర్భంగా సోమవారం మంత్రి క్వార్టర్స్ లో డబ్బా ఓనర్లు కలిసి మా డబ్బాలను తీసుకొనుటకు కొంత సమయంతో పాటు మా బతుకుతెరువుపై మరో మార్గం చూపించి మా డబ్బాలను తీసివేయాలని మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. అందుకు మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి కొంత సమయం ఇచ్చే విధంగా ఆల్టర్నేట్ స్థలాన్ని కూడా చూపించేటట్టు మున్సిపల్ కమిషనర్, పాలకవర్గానికి తెలియజేస్తారని అన్నారు. రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ అవుతున్నాయని తెలిసిన వెంటనే మేమే స్వచ్ఛందంగా షాపులను తీసివేసి అభివృద్ధి పనులకు సహకరిస్తామని మంత్రితో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక అభినందనలు తెలిపిన డబ్బా ఓనర్లు.