‘రైతు భరోసా’ వస్తుందా లేదా.? రైతుల ఆందోళన…!
తెలంగాణ బ్యూరో మార్చి 01(ప్రజాక్షేత్రం):రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇందుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. కాగా మున్సిపల్ ఎన్నికలు ముగిసి వెంటనే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించారు. ఎన్నికలు పుర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో.. ఇప్పట్లో రైతు భరోసా జమ అవుతుందా లేదా అని రైతులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.