రోడ్డు చూస్తే ప్రమాదకరం ప్రయాణించేది ఎలా
-వాగు ఆగిన పనులు పూర్తి చేయరా….
-ప్రమాదకరంగా మారిన రోడ్డు పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
-నెలలు గడుస్తున్న చెరువు అలుగు పనులు పూర్తి చేయరా…
-ఆర్ అండ్ బి అధికారుల ఇది కనిపించడం లేదా
-అధికారులకు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా…
-వాహనదారులకు ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా…
-కూత వేటు దూరంలో కలెక్టర్ కార్యాలయం అయినా పట్టించుకోని అధికారులు
మహేశ్వరం, మార్చి 09(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి రావిరాల గ్రామంలో రావిరాల పెద్ద చెరువు వర్షాకాల సమయంలో చెరువు నిండిపోయి భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చెరువు నుండి వచ్చే అలుగు నీరు తొందరగా వెళ్ళి పోవడానికి అప్పటి అధికారులు నాల తవ్వి వదిలేశారు. వర్షాలు తగ్గి వాటరు పూర్తిగా ఆగిపోయి నెలలు గడుస్తున్న వాగు ఆగిన పనులు పూర్తి చేయడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్న ప్రమాదకరంగా ఉన్న అధికారులకు కనిపించడం లేదా అనే స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న నిత్యం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే అధికారులు ఇదే దారిలో పోతూ ఉంటారు మరి ఎందుకు అధికారుల నిర్లక్ష్యం అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా అని స్థానిక గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలు పత్రికలలో పలు వరుస కథనాలు వచ్చిన అధికారులు చీమకుట్టినట్టు కూడా లేదు అక్కడ ప్రమాదం జరిగితే కానీ అప్పటి వరకు అధికారులు పట్టించుకోరా.. అధికారులకు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా… ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం వ్యవసాయ శాఖ అధికారులు వీటి పారుదల శాఖ అధికారులు సమస్య పట్ల జోక్యం చేసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నెలలు గడుస్తున్న ప్రమాదకరంగా ఉన్న సమస్యని అధికారులు ఎందుకు గుర్తించడం లేదని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించడం లేదా లేక అధికారులు నిద్రపోతున్నారా… ఈ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ జోక్యం చేసుకోని పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఈ సమస్య కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ జోక్యం చేసుకోవాలని రావిరాల గ్రామ ప్రజలు కోరుతున్నారు.