రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శంకర్ పల్లి మార్చి 08(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో గల ఫతేపూర్ లో ఆదివారం రాత్రి స్థానిక కంపెనీలో మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని టంగుటూరు గ్రామానికి తిరుగు ప్రయాణం అవుతుండగా గా ఫతేపూర్ వద్ద టాటా హరియర్ వెహికల్ నెంబర్ టిఎస్07 హెచ్ డబ్ల్యూ 9077 అధిక వేగంతో వచ్చి టిఎస్ 34 ఎఫ్ 8759 ద్విచక్ర వాహనం ఢీకొట్టగా బుర్జుకింది నర్సిములు 45 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు.