సహస్రఫౌండేషన్ సేవలను అభినంధించిన గోపులారం సర్పంచ్ రవీందర్ రెడ్డి
శంకర్ పల్లి మార్చి 23(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలంలోని గోపులారం గ్రామంలో సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశుభ్రత మరియు చెత్త నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చారు. ఆయన సమక్షంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి అవసర మైన చెత్త డబ్బాలు మరియు శానిటేషన్కు సంబంధించిన పరికరాలను గోపులారం గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డికి అందజేశారు. గ్రామ పరిశుభ్రతను మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సహస్ర ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పొడవు శ్రీనివాస్ మాట్లా డుతూ గ్రామ అభివృద్ధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రతి ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిశుభ్రత సాధ్యం కాదని, అందరూ కలిసి పనిచేస్తే గోపులారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొ న్నారు. సహస్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా చెత్త నిర్వహణపై గ్రామ ప్రజలకు
అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ వినియో గాన్ని తగ్గించడం, శానిటేషన్ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలను వివరించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు సాయి, శ్రీకాంత్, చంద్రయ్య, యాదయ్య, సురేందర్, చీర సాయి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గోపులారం గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సహస్ర ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. గ్రామ పరిశుభ్రత కోసం ఇలాంటి కార్య క్రమాలు ఎంతో అవసరమని, ఈ కార్యక్ర మంద్వారా గ్రామ ప్రజల్లో అవగాహన పె రిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ, సహస్ర ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు.