prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 4:14 am Digital Edition : PRAJA KSHETRAM

ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయోత్సాహం వెల్లివిరిసింది..

ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో జాతీయోత్సాహం వెల్లివిరిసింది..

  • 1000 అడుగుల జెండాతో ఆకట్టుకున్న వేడుకలు..
  • దేశభక్తి నినాదాలతో మార్మోగిన చర్లపల్లి

చర్లపల్లి, ఏప్రిల్ 1(ప్రజాక్షేత్రం):కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో ఆక్స్‌ఫర్డ్ పాఠశాల యాజమాన్యం జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 1000 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి భావాలను వ్యక్తపరిచారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని “జై హింద్”, “వందే మాతరం” నినాదాలతో వీధుల్లో ప్రదర్శనగా సాగారు. పరిసర ప్రాంతాలు దేశభక్తి వాతావరణంతో మార్మోగాయి. పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేశభక్తి గేయాలు, ప్రసంగాలతో విద్యార్థులను ప్రేరేపించారు. కొంతమంది విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో చర్లపల్లి సీఐ, ఎస్ఐలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.