ఎన్‌సీసీ ప్రాజెక్ట్‌లో ఘోరం – క్రేన్ ప్రమాదంలో ఐదుగురు మృతి

ఎన్‌సీసీ ప్రాజెక్ట్‌లో ఘోరం - క్రేన్ ప్రమాదంలో ఐదుగురు మృతి శంకర్‌పల్లి, ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ ప్రాజెక్ట్‌లో మధ్యాహ్నం సమయంలో బలమైన గాలుల ప్రభావంతో భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ముఖేష్, నాగేందర్ మాథూర్ (ఝార్ఖండ్), అలీ హుస్సేన్, సాజిద్, సోను (ఉత్తరప్రదేశ్)గా గుర్తించారు. మరో పదిమంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి...