ఏసీబీ వలకి చిక్కిన కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి
- రూ. 10 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ అధికారి
- సర్పంచ్ భర్త కూడా అరెస్టు.. సిద్దిపేట జిల్లాలో కలకలం
సిద్దిపేట జిల్లా మే 11(ప్రజాక్షేత్రం):కొమురవెల్లి మండల కేంద్రంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ప్లాట్లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజీ పైప్లైన్ వేశారు. ఆ పైప్లైన్ను అక్కడ నుంచి తొలగించాలనే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సోమవారం పక్కా ప్రణాళికతో అధికారులు నిఘా పెట్టారు.