కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు హైదరాబాద్, మే 08(ప్రజాక్షేత్రం):రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో (గురువారం) మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులను అరికట్టాలని, శాంతిభద్రతలను కాపాడాలని...