ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం
ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం వికారాబాద్ బ్యూరో 03(ప్రజాక్షేత్రం):ఏకాంతంగా ఉన్న మైనర్ ప్రేమజంటను బెదిరించి, బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ప్రియుడు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితులను ఘటనాస్థలంలోనే పట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో జరిగిందీ ఘటన.వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆమె ప్రియుడు శుక్రవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారిని గమనించిన మహబూబ్నగర్కు చెందిన అశోక్,...