సొంత నిధులతోనే చర్చి నిర్మాణం
కరీంపూర్ ఉప సర్పంచ్ మైసయ్య
వికారాబాద్ బ్యూరో మే 28(ప్రజాక్షేత్రం):కరీంపూర్ గ్రామానికి సంభందించి నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. కరీంపూర్ గ్రామంలో చర్చి స్థలంలోనే ముందు రేకుల షెడ్డు ఉండేది తర్వాత స్లాబ్ వెసి చర్చిని నిర్మించడం జరిగింది. సొంత నిధులతో సుందరి ఎల్లయ్య నిర్మాణం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ పరంగా ఎలాంటి రూపాయి కూడా తీసుకోలేదు కొందరు కావాలని విలువలు భంగం కలిగే విధంగా ఇలా చేస్తున్నారు. వాళ్లపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడమైనది,పరువు నష్టం దావా వేయడం జరిగింది.రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చిల్లర పనులు చేసిన వారి పైన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడమైనది. ఒక వర్గానికి సంభందించి ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన వారి పట్ల, దీనిని ప్రోత్సహించిన వారి పట్ల చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని కరీంపూర్ గ్రామ ఉప సర్పంచ్ మైసయ్య కోరారు.