అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల రైతులకు వరం..!
టిడిపి రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యన్.రమాకాంత్ రెడ్డి
పెద్ద కడుబూర్ జూన్ 20(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి యన్,. రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతుల ఆర్థిక భారం తగ్గించి, వ్యవసాయ పెట్టుబడులకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటలకు గిట్టుబాటు ధర కల్పనతో పాటు ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు రైతులకు ఖరీఫ్ సాగుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సుచరిత, సింగల్ విండో చైర్మన్ ఆంజనేయులు ,టౌన్ అధ్యక్షులు డి మల్లికార్జున, దొడ్డిమేకల నరసింహారెడ్డి, ఎం. రామన్న జె.అనుమంతు జె. దెవసహయం బి.ఇమ్మనేలు , సొసైటీ సీఈఓ మురళి రెడ్డి ,రైతులు తదితరులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.