రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల నేత సలీం పాషా జన్మదిన వేడుకలు
శంకర్ పల్లి జూన్ 17(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే–ఐజేయూ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు ఎండీ సలీం పాషా జన్మదిన వేడుకలను జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు బొల్లారం వెంకట్రెడ్డి, రంగారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు ప్రసాద్, శేరిలింగంపల్లి సీనియర్ జర్నలిస్టులు కబీర్, వరుణ్, నర్సింహా, ఖాజా, యాసీన్, అలాగే శంకర్పల్లి ప్రెస్ క్లబ్ కార్యదర్శి జిలాని తదితరులు పాల్గొని సలీం పాషాకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.