prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 6:21 am Digital Edition : PRAJA KSHETRAM

కనిపించకుండా పోయిన వ్యక్తి మాల ఆనంద్

కనిపించకుండా పోయిన వ్యక్తి మాల ఆనంద్

శంకర్ పల్లి జులై 01(ప్రజాక్షేత్రం):బుల్కాపూర్ గ్రామానికి చెందిన మాల ఆనంద్ గచ్చిబౌలిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఉద్యోగ సంబంధంగా కోలిక్స్ సంస్థతో కలిసి ఒడిశాకు టూర్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో భోజనం చేశారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆచూకీ తెలియడం లేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకుతున్నప్పటికీ ఆయన కనిపించలేదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చారు
ఆయన గురించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే, దయచేసి సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా కుటుంబ సభ్యులకు వెంటనే తెలియజేయండి.

వివరాలు

పేరు మాల ఆనంద్ గ్రామం బుల్కాపూర్ మండలం శంకర్ పల్లి జిల్లా రంగారెడ్డి వయసు 25 సంవత్సరాలు ఎత్తు 5 పీట్ల 4ఇంచులు గుర్తులు లాంగ్ హేర్ చివరి సారి ధరించిన దుస్తులు బ్లాక్ కలర్ హాఫ్ షర్ట్ ఎల్లో కలర్ లైన్స్ చివరి సారి కనిపించిన ప్రదేశము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ తప్పిపోయిన తేదీ.30-6-2026 సమయం 10: 30నిమిషాలు పైన ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
కుటుంబ సభ్యులు మాల మాణిక్యం ఫోన్ నెంబర్ 6281525799 మాల ప్రవీణ్ ఫోన్ నెంబర్ 9381812036