గాంధీ భవన్లో చేవెళ్ళ నేతల నిరసన.
- ఎమ్మెల్యే యాదయ్య పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి. నావాబ్ పేట జులై 03(ప్రజాక్షేత్రం):కాలే యాదయ్యపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కాలే యాదయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ యాదయ్య జోక్యం చేసుకోకూడదు అంటూ డిమాండ్ చేశారు. కాలే యాదయ్య అన్ని పదవులు బీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారంటూ మండిపాటు.చేశారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.