
న్యూసెన్స్ సృష్టించిన వ్యక్తికి జైలు
పోలీసులను దూషించిన యువకుడికి శిక్ష
కుషాయిగూడ, జూలై 21(ప్రజా క్షేత్రం): మల్కాజిగిరిపోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో హాస్టల్ వద్ద న్యూసెన్స్ సృష్టించి, విధులు నిర్వహిస్తున్న పోలీసులను దూషించి ఆటంకం కలిగించిన యువకుడికి కోర్టు ఒక రోజు సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది.పోలీసుల కథనం మేరకు.. సౌత్ కమలానగర్లోని శ్రీ సాయి సంతోషిని హాస్టల్ నిర్వాహకురాలి ఫిర్యాదుతో జి. భరత్కుమార్ (30)పై కేసు నమోదు చేశారు. హాస్టల్ వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు పోలీసులను దూషించినందుకు సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 70(బి), బీఎన్ఎస్ సెక్షన్ 292 కింద పెటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఒక రోజు సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది.