షాబాద్ జులై 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని దారుణంగా చంపాడో కిరాతకుడు. షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మృతుల్లో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు నిందితుడి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉండటం గమనార్హం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.