ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. ప్రైవేట్ పార్ట్ను కొరికిన విద్యార్థి
కొల్లాపూర్ జులై 08(ప్రజాక్షేత్రం):నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్ను కొరికి గాయపరిచిన విద్యార్థి తిరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కళాశాలలో 2025లో పీజీ పూర్తి చేసిన విద్యార్థి తన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కోసం కళాశాల ప్రిన్సిపాల్ను కోరగా అతను తన ఇంటికి వస్తే టిసి ఇస్తానని తనతో శారీరకంగా కలవాలని కోరాడని విద్యార్థి వాపోయారు. దీంతో మంగళవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళారు. ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించగా విద్యార్థి.. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్ను కొరికేశాడు. దీంతో ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై విద్యార్థి స్నేహితుడు వీడియో తీయగా విద్యార్థి నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.