prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:27 pm Digital Edition : PRAJA KSHETRAM

ఆర్ కృష్ణయ్య మర్యాద పూర్వకంగా కలిసిన బిసి సంఘం నాయకులు బండమీది వెంకటేష్.

ఆర్ కృష్ణయ్య మర్యాద పూర్వకంగా కలిసిన బిసి సంఘం నాయకులు బండమీది వెంకటేష్.

శంకర్ పల్లి ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ యాదవ్ జాతీయ బి.సి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ని మర్యాద పూర్వకంగా కలిసి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసారు. బండమీది వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో బీసీల పాత్ర, వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం సంఘం ఆధ్వర్యంలో మరింత కృషి చేయాలని, బిసి సంఘం ప్రజలకు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.