మహానంది ఆలయానికి నూతన ధర్మకర్తల మండలి

మహానంది ఆలయానికి నూతన ధర్మకర్తల మండలి నంద్యాల, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):మహానంది శ్రీ మహానందీశ్వరస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. చైర్మన్‌గా నరాల చంద్రమౌళి రెడ్డి ప్రమాణం చేయగా, అనంతరం పాలకమండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎన్‌ఎండీ ఫయాజ్, తులసిరెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు హాజరయ్యారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.