prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:35 pm Digital Edition : PRAJA KSHETRAM

బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

– త్రుటిలో లో తప్పిన భారీ ప్రమాదం

కరీంనగర్ సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఘటన లో 54 మంది ప్రయాణికులు త్రుటి లో ప్రాణాపాయం నుంచి తప్పించుకు న్నారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపుకు 54 మంది ప్రయాణి కులతో వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురికావడంతో నలుగురు ప్రయాణి కులకు స్వల్ప గాయాలయ్యాయి. సకాలంలో బస్సు బావిలో పడి పోకుండా ఆగిపోవ డంతో భారీ ప్రమాదం తప్పిందని, స్థానికు లు చెబుతున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నా రని స్థానికులు తెలిపారు.