మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి.

డప్పును, మాదిగలను అవమానించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్. హైదరాబాద్ సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):సంధ్యారావు అనే వ్య‌క్తిని సృష్టించింది ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డేనని, డప్పును.. మాదిగలను అవమానించినందుకు మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మాదిగలు ఎవరి చావును కోరుకోరని, డప్పు..! మనిషి బతకాలని చెప్పే తమ సంస్కృతిలో భాగమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంధ్యారావు ఎవరో, ఆమెను ఎవరు...