రెడ్ల నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
కుషాయిగూడ: రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న నిరసన దీక్షకు కుషాయిగూడ రెడ్డి సంఘం సభ్యులు పెద్దసంఖ్యలో తరలిరావాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కుషాయిగూడలో సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగిళ్ల బాల్రెడ్డి, కార్యదర్శి మొగిలి రాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడు బీవీ నర్సింహారెడ్డి, సలహాదారు బోలంపల్లి రాంచందర్రెడ్డి, జేఏసీ నాయకులు పైళ్ల హరినాథ్రెడ్డి, మధుకర్రెడ్డి, రవీందర్రెడ్డి, రాంచందర్రెడ్డి పాల్గొన్నారు. సంఘం సభ్యులు రణధీర్రెడ్డి, యాదిరెడ్డి, గంగిరెడ్డి, కేసిరెడ్డి, జీవన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కాటేపల్లి శివరెడ్డి, శ్రవణ్కుమార్రెడ్డి, అనుముల వెంకట్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.