లంచం తీసుకుంటుండగా కీసర ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

రూ.10 లక్షల లంచం డిమాండ్‌ ఆరోపణలు.. కీసర పోలీసులపై ఏసీబీ దాడులు రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ ఏసీబీకి చిక్కిన వైనం కీసర, సెప్టెంబర్ 17(ప్రజాక్షేత్రం):మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రూ.5 లక్షల లంచం తీసుకుంటున్న కీసర ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు వద్ద కారులో నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ఓ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు...