మర్పల్లి జూన్ 06(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా మర్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఓ హోటల్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జెసిబిల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా? అని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.

