📄 ePaper
Tuesday, February 24, 2026
ads
📄 ePaper
Homeరాజకీయంబీజేపీకి ఆరూరి రమేశ్‌ గుడ్‌బై

బీజేపీకి ఆరూరి రమేశ్‌ గుడ్‌బై

📰 Generate e-Paper Clip

బీజేపీకి ఆరూరి రమేశ్‌ గుడ్‌బై

 

హైదరాబాద్ జనవరి 26(ప్రజాక్షేత్రం):మునిసిపల్ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్ధన్నపేట మాజీ శాసన సభ్యుడు ఆరూరి రమేశ్‌ ఆ పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు రమేష్ ప్రకటించారు. ఈయన గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల ముందు పార్టీ మారారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. అయితే.. ఆయన కారు పార్టీలో ఎప్పుడు చేరతారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular