📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్వికారాబాద్‌లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్‌లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

వికారాబాద్‌లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్ ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):వికారాబాద్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని టౌన్ గంగారం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రఘుకుమార్ మాట్లాడుతూ మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ధరూర్ పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్‌లో “నా చావుకు ఎవరు కారణం కాదు. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు” అని పేర్కొన్నట్లు సీఐ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, సహచరులు మరియు కాలనీ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular