డాక్టర్ల నిర్లక్ష్యం.. ఆస్పత్రిలో చిన్నారి మృతి
వికారాబాద్ జూన్ 01(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలోని మహావీర్ ఆస్పత్రిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారికి జ్వరం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆస్పత్రిలో చేర్చుకోవడంలోనూ, వైద్యం చేయడంలోనూ డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని, అందుకే పాప చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు పేర్కొన్నారు.

