📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

విద్యార్థులు, యువత సమస్యలపై భారీ ర్యాలీ

కుషాయిగూడ, సెప్టెంబరు 5(ప్రజా క్షేత్రం): విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసీఐఎల్‌ రౌండ్‌ బిల్డింగ్‌ నుంచి రాధిక చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యోగాల పంచాంగాన్ని ప్రకటించాలని ర్యాలీలో డిమాండ్‌ చేశారు. గతంలో ప్రకటించిన యువజన ప్రకటనను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular