📄 ePaper
Monday, April 13, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఆడంబరాలకు దూరంగా.. రిజిస్టర్ మ్యారేజ్ తో ఒక్కటైన ఐఏఎస్-ఐపీఎస్ జంట!

ఆడంబరాలకు దూరంగా.. రిజిస్టర్ మ్యారేజ్ తో ఒక్కటైన ఐఏఎస్-ఐపీఎస్ జంట!

📰 Generate e-Paper Clip

ఆడంబరాలకు దూరంగా.. రిజిస్టర్ మ్యారేజ్ తో ఒక్కటైన ఐఏఎస్-ఐపీఎస్ జంట!

 

భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి 24(ప్రజాక్షేత్రం):ఉన్నత ప్రభుత్వ హోదాల్లో ఉన్నప్పటికీ, ఆడంబరాలకు దూరంగా ఉంటూ ఓ ఐపీఎస్ అధికారిణి, శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారి నిరాడంబరంగా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లింగారెడ్డిగూడెంకు చెందిన ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, ఏపీలోని కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి శనివారం చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యంత సాదాసీదాగా వీరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్ట్రార్ ఎదుట సంతకాలు చేసి ఈ జంట ఒక్కటయ్యారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శేషాద్రిని, ఐఏఎస్ శిక్షణార్థి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా వివాహం చేసుకోవడం విశేషం. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న ఈ జంట తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. హోదా పెరిగినా ఒదిగి ఉండాలనే వీరి తీరు ఎందరికో స్ఫూర్తినిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరైన పలువురు ఉన్నతాధికారులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular