📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకాప్రా–నాచారం సర్కిళ్లలో అక్షరాస్యత పరీక్షలు విజయవంతం

కాప్రా–నాచారం సర్కిళ్లలో అక్షరాస్యత పరీక్షలు విజయవంతం

📰 Generate e-Paper Clip

కాప్రా–నాచారం సర్కిళ్లలో అక్షరాస్యత పరీక్షలు విజయవంతం

  • 7 కేంద్రాల్లో నిర్వహణ… 500 మందిలో 353 మంది హాజరు
  • ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్ కుమార్ సూచన

కాప్రా, మార్చి 29(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం భాగంగా కాప్రా మరియు నాచారం సర్కిళ్లలో ఆదివారం పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ప్రజల్లో విద్యా ప్రాముఖ్యత పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 500 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 353 మంది హాజరయ్యారు. ఉదయం నుంచే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకొని పరీక్ష రాశారు. నిర్వాహకులు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కేంద్రాలను మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ యూసీడి విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సురేష్ కుమార్ పరిశీలించారు. అభ్యర్థులతో మాట్లాడి వారి అభ్యాసంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు విద్యను అలవరచుకొని మహిళా సంఘాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా “ఇంటికి వెలుగు ఇల్లాలి చదువు – మహిళా పొదుపు దేశానికి మలుపు” అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. చదువు ద్వారా అవగాహన పెరిగి కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా, నాచారం కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీనివాసరెడ్డి, గోపాల్, స్వామి దాస్, ఎం. వెంకటేశం, ఆర్పీలు, ఇతర సిబ్బంది పాల్గొని పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular