ప్రమాద బాధితుడికి మొకిలా సీఐ సాయం
శంకర్ పల్లి మే 11(ప్రజాక్షేత్రం):నార్సింగ్ పరిధిలోని మేఖానడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తుతెలియని వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మొకిలా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ మానవత్వం చాటుకున్నారు. సోమవారం పోలీస్ స్టేషన్కు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదానికి గురై గాయాలతో పడిఉన్న వ్యక్తిని ఆయన గమనించారు. వెంటనే తనతో ఉన్న కానిస్టేబుల్ నరేందర్ సహాయంతో గాయపడిన వ్యక్తిని ఆటో ద్వారా నార్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

