📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

📰 Generate e-Paper Clip

వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

వికారాబాద్ బ్యూరో ఏప్రిల్ 13(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గేటు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన లారీ, స్కూటీని బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు తాండూరు నుండి జహీరాబాద్‌కు స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొనడంతో, వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular