📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం

కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం

  • నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలో దొంగతనం
  • తుపాకులతో జ్యువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన దుండగులు

కరీంనగర్ జిల్లా మే 03(ప్రజాక్షేత్రం):సిబ్బందిపై కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులు కరీంనగర్ పట్టణంలో ఓ జ్యువెల్లరీ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో ఆరుగురు దుండగులు ప్రవేశించారు. జ్యువెల్లరీ దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ దుండగులు సిబ్బందిపై 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular