43 వ డివిజన్ లో వీధిలైట్లు ఏర్పాటు
- కార్పొరేటర్ దొంత శ్రీనివాస్
గోదావరిఖని జూలై 03(ప్రజాక్షేత్రం):రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 43 డివిజన్ లో అంబేద్కర్ నగర్ విధుల్లో వీధి దీపాలు వెలగక పోవడం తో బస్తి వాసులు డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చెయ్యాలి అని కార్పొరేటర్ ను కోరారు. వెంటనే మున్సిపల్ విద్యుత్ సిబ్బందితో మాట్లాడి శుక్రవారం నూతన వీధి దీపాలు ఏర్పాటు చెయ్యాలి అని ఆదేశించారు. నూతన వీధిలైట్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేసినందుకు కార్పొరేటర్ కి బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

