మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ లోపే మార్పులు చేర్పులు!
హైదరాబాద్ ఆగస్టు 30(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ను కేబినెట్లోకి తీసుకుంటే ఆ కుర్చీ ఖాళీ కానుంది. ఆ స్థానాన్ని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు స్పీకర్ మార్పు, మంత్రుల శాఖల మార్పు, ఒకరిద్దరు మంత్రుల తొలగింపు, కొత్త వారికి అవకాశం ఇలా భారీ స్థాయిలో మార్పులు చేర్పులకు సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

