📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మున్సిపల్ చైర్మన్ ని సత్కరించిన క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.

మున్సిపల్ చైర్మన్ ని సత్కరించిన క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.

📰 Generate e-Paper Clip

మున్సిపల్ చైర్మన్ ని సత్కరించిన క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.

శంకర్ పల్లి మార్చి 28(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, కమిషనర్ యోగేష్ కుమార్, ఒకటవ వార్డ్ కౌన్సిలర్ ఎర్రోళ్ల ఆనందరావు, పదవ వార్డ్ కౌన్సిలర్ రాజండ్ల వసంత మహేందర్ రెడ్డి ని సంయుక్తంగా కలసి గత కొంతకాలంగా క్రిస్టల్ టౌన్షిప్ కాలనీలో నెలకొని ఉన్న ప్రధాన సమస్యలైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, విధి దీపాల ఏర్పాటు, మొదలగు సమస్యల గురించి చర్చించి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. దానికి వారు స్పందించి ఇంజనీర్ ని పిలిచి క్రిస్టల్ టౌన్షిప్ సమస్యలకుపై నివేదికను రూపొందించాలని తెలపడం జరిగింది. వారు సిసి రోడ్డు నిర్మాణం చేపడుదాం అని తెలుపగా కాలనీలో ప్రధానంగా సెంట్రలైజ్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులం కోరడం జరిగింది. వారు దానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అనంతరం నూతనంగా చైర్మన్ పదవిని చేపట్టిన మున్సిపాలిటీ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, మున్సిపాలిటీ కమిషనర్ యోగిష్ కుమార్ మరియు వార్డు కౌన్సిలర్ ఎర్రోళ్ల ఆనందరావు, రాజండ్ల వసంత మహేందర్ రెడ్డి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, మరియు క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు ఎం విఠలయ్య, మరియు కొలాన్ గోవింద్ రెడ్డి, అధ్యక్షులు కొలాన్ ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్పల్లి అశోక్, సంయుక్త కార్యదర్శి కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, కాలనీవాసులు రవికుమార్, రాఘవేందర్ రెడ్డి, రామచంద్రయ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular