📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్జాతీయ ఓటరు దినోత్సవ సందర్బంగా భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.

జాతీయ ఓటరు దినోత్సవ సందర్బంగా భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.

📰 Generate e-Paper Clip

జాతీయ ఓటరు దినోత్సవ సందర్బంగా భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.

ఓటు హక్కు: ప్రజాస్వామ్యానికి ప్రాణం.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే కాదు. ప్రతి పౌరుడికి సమానమైన రాజకీయ హక్కులు కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అందులో అత్యంత కీలకమైనది ఓటు హక్కు. ఈ హక్కు ద్వారా ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే అధికారం పొందుతారు. భారతదేశంలో ఈ ఓటు హక్కు అన్ని వర్గాలకు సమానంగా అందిందంటే, దానికి ప్రధాన కారణం డా. బీ.ఆర్. అంబేడ్కర్ గారి దృఢమైన దృష్టి, నిరంతర పోరాటం.

  • యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ – అంబేడ్కర్ గారి చారిత్రక ఆలోచన.

బ్రిటిష్ పాలన కాలంలో ఓటు హక్కు అన్నది సంపద, ఆస్తి, పన్ను చెల్లింపు, అక్షరాస్యత వంటి అర్హతలతో ముడిపడి ఉండేది. సామాన్య ప్రజలు, శ్రామికులు, దళితులు, మహిళలు రాజకీయ వ్యవస్థకు పూర్తిగా దూరంగా ఉంచబడేవారు. ఈ అన్యాయ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన తొలి భారతీయ ఆలోచకుల్లో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ముఖ్యులు. సౌత్‌బరో కమిషన్ (Southborough Committee – 1919) ముందు ఆయన సమర్పించిన వినతిపత్రంలో, “లింగం, కులం, మతం, ఆస్తి, విద్య అనే భేదాలు లేకుండా ప్రతి పెద్దవయసు భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలి” అని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఇది భారతదేశంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కోసం చేసిన మొదటి శాస్త్రీయ, రాజకీయ విన్నపంగా చరిత్రలో నిలిచింది.

  • రాజ్యాంగం ద్వారా సమాన ఓటు హక్కు.

భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో డా. అంబేడ్కర్ గారు ఈ సూత్రాన్ని రాజ్యాంగంలో మౌలికంగా పొందుపరచేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆయన దృష్టిలో రాజకీయ ప్రజాస్వామ్యం నిలవాలంటే, ముందుగా సామాజిక ప్రజాస్వామ్యం అవసరం. ఆ సమయంలో కొందరు నాయకులు, ముఖ్యంగా “దేశం అక్షరాస్యతలో వెనుకబడి ఉంది” అనే కారణంతో పరిమిత ఓటు హక్కును సమర్థించారు. ఈ సందర్భంలో బాబాసాహెబ్ గారు వల్లభాయ్ పటేల్ వంటి ప్రముఖ నాయకులతో కూడా తీవ్ర అభిప్రాయ భేదాలను ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా, ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాల్సిందే అనే సిద్ధాంతాన్ని గట్టిగా నిలబెట్టారు.

  • భారతీయ మహిళలకు ఓటు హక్కు – ఒక విప్లవాత్మక మార్పు.

ఈ రోజు భారతదేశంలోని ప్రతి మహిళ ఓటు హక్కును వినియోగించుకుంటోంది. ఇది సహజంగా వచ్చిన హక్కు కాదు; ఇది ఒక చారిత్రక పోరాట ఫలితం. స్వాతంత్ర్యం ముందువరకు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. ఓటు హక్కు అనేది “పురుషుల రాజకీయ హక్కు”గా మాత్రమే భావించబడేది. డా. అంబేడ్కర్ గారు మాత్రం మహిళా–పురుష సమానత్వాన్ని రాజ్యాంగంలో మౌలికంగా ప్రతిష్ఠించారు. అందువల్లే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే భారతీయ మహిళలకు సంపూర్ణ ఓటు హక్కు లభించింది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత సమగ్ర ప్రజాస్వామ్యంగా నిలిపింది.

  • నేషనల్ ఓటర్స్ డే – హక్కుతో పాటు బాధ్యత.

ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఒక్కటే – ఓటు హక్కు విలువను గుర్తు చేయడం, యువతలో ప్రజాస్వామ్య చైతన్యం పెంపొందించడం. ఓటు హక్కు కేవలం హక్కే కాదు, అది ఒక సామాజిక బాధ్యత. డా. అంబేడ్కర్ గారు ఇచ్చిన ఈ హక్కును సజాగ్రత్తగా, వివేకంతో వినియోగించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది. ఈ రోజు మనం స్వేచ్ఛగా ఓటు వేస్తున్నామంటే, అది సహజంగా వచ్చిన వ్యవస్థ కాదు. అది డా. బీ.ఆర్. అంబేడ్కర్ గారి దూరదృష్టి, ధైర్యం, ప్రజాస్వామ్యంపై ఉన్న అపార విశ్వాసం వల్ల సాధ్యమైంది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా, ఆ మహానుభావుడి సేవలను స్మరించుకుంటూ – మన ఓటు హక్కును గౌరవిద్దాం, బాధ్యతతో వినియోగిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login