📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

-సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాధరణ

-బండమీద వెంకటేష్ బిసి సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజవర్గ అధ్యక్షులు

శంకర్ పల్లి ఫిబ్రవరి 03(ప్రజాక్షేత్రం):సంచలన కథనాలతో తెలుగు ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ప్రజాక్షేత్రం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను బిసి సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ప్రజాక్షేత్రం ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా బండమీద వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రం మీడియా ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి కొత్త ట్రెండును సృష్టించిందన్నారు. ప్రజాక్షేత్రం మీడియా మరింత మంచి కథనాలతో దినదినాభివృద్ధి చెందాలని కార్యక్రమంలో వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ గోపాల్, శ్రీనివాస్, శేఖర్, మల్లేష్ యాదవ్, హన్మంత్, మహేష్, శివ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular