📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.ప్రకాష్ రెడ్డి.

రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.ప్రకాష్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.ప్రకాష్ రెడ్డి.

బంగారుపాళ్యం మే 23(ప్రజాక్షేత్రం):చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తుమ్మేజి పల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎం.ప్రకాష్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఆదేశాల మేరకు గురువారం నియమితులయ్యారు. తాను 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీలకు ఎంతగానో కృషి చేసి పని చేశారని పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంచుకొని రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టారు. గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేసి గ్రామానికి ఎన్నో సేవలు అందించారు. మండల జిల్లా స్థాయిలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వాన్ని బలపరచుకున్నారు. తనకు పదవి రావడం పట్ల రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ పెద్దలు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఎం బి కుమార్ రాజా, మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular